ఎంపీ కేశినేని నానికి షాక్ ఇచ్చిన పోలీసులు

by  |
mp-keshineni
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డానికి వెళ్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఎంపీ వాహనాన్ని ఘాట్‌రోడ్డులో అడ్డుకున్నారు. దీంతో ఎంపీ కేశినేని నాని త‌న కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన‌ కొండపైకి వెళ్లారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ‌లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్లేట‌ప్పుడు పోలీసులు ఆయ‌న‌ కారుకు అనుమతులు ఇచ్చిన‌ప్పటికీ అధికారుల తీరుకు నిరసనగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ నడిచే వెళ్లారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించ‌డం లేద‌ని పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed