అర్ధరాత్రి ఉద్రిక్తత.. వెనుదిరిగిన పోలీసులు

by  |
అర్ధరాత్రి ఉద్రిక్తత.. వెనుదిరిగిన పోలీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం గోపారాజు పల్లెలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ యువతి కిడ్నాప్ కేసులో రఘుపతి అనే యువకుడిని అరెస్ట్ చేయడానికి ప్రొద్దుటూరు పోలీసులు గత రాత్రి గోపారాజుపల్లెకు వచ్చారు. అయితే నిందితుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటని గ్రామస్తులు పోలీసులను ప్రశ్నిస్తూ అరెస్టును అడ్డుకున్నారు.

దీంతో గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు గో బ్యాక్ అంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామస్తుల ప్రతిఘటనతో నిందితుడిని అరెస్ట్ చేయకుండానే పోలీసులు వెనుతిరిగారు.

Next Story