వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

by  |
వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు
X

దిశ, కాటారం:
గోదావరి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాళ్లోకి వెళితే… భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుంట్ల ఇసుక క్వారీ నుండి కొల్లూరు క్వారీకి గోదావరి నదిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెలుతున్నాడు. ఈ సమయంలో నదిలో వరద ఉధృతంగా రావడంతో ఆయన నీటిలో చిక్కుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న కాళేశ్వరం పోలీసులు హుటాహుటిన నాటు పడవలో వెళ్లి అతన్ని రక్షించారు. బాధితున్ని జేజీబీ డ్రైవర్ జీవన్‌గా గుర్తించారు.

Next Story

Most Viewed