ఈతకు వెళ్లారు.. కేసులో ఇరికారు

by  |

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌ను ధిక్కరించి ఏకంగా జలాశయంలోనే ఈతకు వెళ్లిన నలుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లారు. వారిని పట్టుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags: Karimnagar,LMD,Swim,police,case file

Next Story

Most Viewed