మట్కా స్థావరంపై పోలీసుల దాడులు

by  |
మట్కా స్థావరంపై పోలీసుల దాడులు
X

దిశ, తాండూరు: గుట్టు చప్పుడు కాకుండా మట్కా స్థావరం పై జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డి నివాసంపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు గోపాల్ రెడ్డి, అతని భార్యతో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వీరిని పట్టణ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.31,100 వేల నగదు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed