మావోల శిబిరంపై పోలీసుల దాడి

by  |
మావోల శిబిరంపై పోలీసుల దాడి
X

ధిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ కొనసాగతోంది. నాల్గో రోజు కూడా బలగాలు మావోల ఏరివేతే లక్ష్యంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా భైరంఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరంపై డిస్ట్రిక్ట్ రిజర్వూ బలగాలు (డీఆర్జీ) దాడి చేశాయి.

ఈ ఘటనలో డీసీవీఎం చంద్రన్న నేతృత్వంలోని మావోయిస్టు పార్టీ బృందం తప్పించుకుందని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

Next Story