మాజీ డీజీపీ ఇంట్లో సోదాలు

by  |
మాజీ డీజీపీ ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో భాగంగా పంజాబ్ మాజీ డీజీపీ సుమేద్ సింగ్ సైనీ ఇంట్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. 1991లో బల్వంత్ సింగ్ ముల్తానీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతడి సోదరుడు నాటి ఛండీఘఢ్‌ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్‌ఎస్‌స్పీ)గా ఉన్న సైనిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సైనిపై నెల రోజుల క్రితం కేసు నమోదు అయింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం చంఢీఘడ్ సెక్టార్ 20లోని సైనీ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అయితే ఆ సమయంలో సైని ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed