అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎస్పీ సునీల్ దత్

by  |
అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎస్పీ సునీల్ దత్
X

దిశ,ఖమ్మం ,కొత్తగూడెం: పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సబ్ డివిజన్ పోలీసుల చేత సైకిల్ ర్యాలీ చేయించారు. కొత్తగూడెం డీఎస్పీ జి వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ తమ విధుల పట్ల అంకితభావంతో ఉండాలని కోరారు. ప్రస్తుతం మనం ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నామంటే అది అమరవీరుల త్యాగ ఫలితమే అని చెప్పుకొచ్చారు.

శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసుల పాత్ర ప్రముఖమేనని, కానీ వారికి ప్రజలు, యువత సహకారం అందిస్తేనే నేర రహిత సమాజం రూపుదిద్దుకుంటుందని అన్నారు. పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సేవ చేయాలని, సంఘ విద్రోహ శక్తులను అంతమొందించాలని సూచించారు.

Next Story

Most Viewed