పండ్ల వ్యాపారిని చితకబాదిన పోలీసులు

by  |
పండ్ల వ్యాపారిని చితకబాదిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అకారణంగా ఓ వ్యాపారిని చితకబాదారు. నారాయణఖేడ్‌లో కరోనా విజృంభణ కారణంగా వ్యాపారులందరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకే దుకాణాలు మూసివేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న పండ్ల వ్యాపారిని స్థానిక పోలీసులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed