చిట్యాలలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల పై లాఠీచార్జ్

by  |
congress
X

దిశ, నల్లగొండ: పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇరువర్గాల ర్యాలీతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తుంగతుర్తి వెళుతున్న సందర్భంగా అతనికి స్వాగతం చెప్పేందుకు మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చిట్యాల మండల కేంద్రానికి వచ్చారు. అలాగే టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల అభినందన సభకు జిల్లా మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు లాఠీఛార్జి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


Next Story

Most Viewed