కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

by  |
కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
X

దిశ, హైదరాబాద్: ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర తెలిపిన ప్రకారం.. ఫరూక్ నగర్‎కు చెందిన రఫియా సుల్తానా ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో షామా టాకీస్ దగ్గర గరీబ్ నవాజ్ క్లినిక్ కు వైద్యం నిమిత్తం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన రెండో కుమారుడు షేక్ అబ్దుల్ వాహెబ్ ఆస్పత్రి ఎదుట ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆ ప్రదేశంలో తన కుమారుడు లేకపోవడాన్ని గమనించిన రఫియా సుల్తానా క్లినిక్ పరిసర ప్రాంతాల్లో వెతికింది. ఎంతకీ ఆచూకీ తెలియకపోయే సరికి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ఫలక్ నూమా పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పలు కోణాల్లో విచారించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దూద్ బౌలికి చెందిన సమ్రీన్ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.


Next Story

Most Viewed