తప్పు చేస్తే.. వదిలే ప్రసక్తే లేదు : ఏపీ డీజీపీ

by  |
తప్పు చేస్తే.. వదిలే ప్రసక్తే లేదు : ఏపీ డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల మండలం నియోజకవర్గ పరిధిలోని కౌలూరు వద్ద ఈ నెల 3న రైలు కింద పడి ఆటో డ్రైవర్ అబ్దుల్ సమద్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీఎం జగన్ ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు, ఇప్పటికే సీఐ సోమశేఖర్ రెడ్డిని, కానిస్టేబుల్ గంగాధర్‌ను సస్పెండ్ చేసి, సస్పెండ్ చేశారు. అంతేగాకుండా నంద్యాలలో ఐజీ శంకబ్రత బగ్చి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ… తప్పు చేస్తే.. ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Next Story