- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్టేషన్ ఘన్పూర్ : పత్తి చేనులో పనిచేస్తున్న కూలీలను చూడగానే ఆ పోలీసు అధికారి కాళ్లు అప్రయత్నంగానే వారి వైపు కదిలాయి. పోలీస్ అధికారి తమై వైపు వస్తున్న విషయాన్ని గమనించిన ఆ కూలీలు భయంతో వణికిపోయారు. సార్ ఎందుకు వస్తున్నారంటూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. కూలీల ముఖంలో భయాందోళనను గమనించిన ఆ అధికారి అవ్వ భయపడకండి, ఊరికనే వచ్చాను.. మిమ్మల్ని చూడగానే పొలం పనులు చేసే మా అమ్మనాన్నలు గుర్తుకు వచ్చారంటూ తెలపడంతో కూలీలు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
జనగాం రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ లింగాల ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ను సోమవారం సందర్శించారు. తిరిగి వస్తున్న క్రమంలో కుందారం గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో పోలం పనులు నిర్వహిస్తున్న మహిళా కూలీలు పొలంలో పత్తి మొక్కలకు యూరియా మందు వేస్తూ కనిపించారు. కొద్దిసేపు వారితో పొలం పనులు చేసిన సీఐ వారి కష్ట సుఖాలను తెలుసుకోవడం గమనార్హం. పోలీస్ అధికారి తమతో కలసి పోలం పనులు నిర్వహించడం పట్ల సదరు పనులు చేస్తున్న రైతులు ఆనంద పడ్డారు.