విశాఖ మన్యంలో మావోల అలజడి

by  |
విశాఖ మన్యంలో మావోల అలజడి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. మంగళవారం మావోల కదలికల పై అనుమానం వచ్చిన అధికారులు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూమిలో అమర్చిన మందుపాతరలను వెలికి తీశారు. జీకే వీధి మండలం పెదపాడు, కుంకుంపూడి ఏరియాల్లో మందు పాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా రెండు మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. ల్యాండ్‌మైన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed