సుల్తానాబాద్ హత్య కేసును చేధించిన పోలీసులు

by  |
సుల్తానాబాద్ హత్య కేసును చేధించిన పోలీసులు
X

దిశ, వెబ్‎డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న చంద్రనాయక్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భార్య జ్యోతి భాయి కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో చంద్రనాయక్‎ను జ్యోతి హత్య చేయించింది. నిందితురాలు జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివనాగార్జున, తనకు సహకరించిన అక్క కొడుకు సాయికుమార్‎ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.



Next Story