మా పోలింగ్.. ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల క్రమంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెలబ్రెటీలను చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హీరో అఖిల్ వచ్చిన సమయంలో సెల్ఫీల కోసం అభిమానులు ఎగపడ్డారు. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రానికి హీరోల అభిమానులు భారీగా తరలివచ్చారు. అటు మా ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రకాష్ [&hellip;]</p>

మా పోలింగ్.. ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల క్రమంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెలబ్రెటీలను చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హీరో అఖిల్ వచ్చిన సమయంలో సెల్ఫీల కోసం అభిమానులు ఎగపడ్డారు. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రానికి హీరోల అభిమానులు భారీగా తరలివచ్చారు. అటు మా ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 580 మంది ఓటేయగా.. రికార్డు స్థాయిలో 56 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.

Next Story