మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు..

by  |
మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో మార్పులు చెందిన వైరస్‌ను ‘ఇండియన్​ వేరియంట్’​అని ప్రపంచం భావిస్తోందని తెలిపారు. ఆయన మాటలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌నాథ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్​చౌహాన్​.. కాంగ్రెస్​అధిష్టానాన్ని డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Next Story

Most Viewed