- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయం ఆవరణలో పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ను సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పోలీసుల సౌకర్యార్థం ఈ సబ్సిడీ క్యాంటీన్ను ప్రారంభించినట్టు తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసరాలు సరుకులు అతి తక్కువ ధరకు, చౌకగా లభిస్తాయన్నారు. ఈ సౌకర్యాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం క్యాంటీన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ వెంకటేశ్వర రావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని, బాలానగర్ డీసీపీ పద్మజా, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీసీపీలు మాణిక్ రాజ్, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కవిత తదితర అధికారులు పాల్గొన్నారు.