‘తెలుగు తల్లి’పై సొమ్మసిల్లిన షర్మిల.. లోటస్‌పాండ్‌కు తరలింపు

by  |
‘తెలుగు తల్లి’పై సొమ్మసిల్లిన షర్మిల.. లోటస్‌పాండ్‌కు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ధర్నాచౌక్ వద్ద కొలువు దీక్ష భగ్నం అనంతరం కాలినడకన ఆమె లోటస్‌పాండ్ బయల్దేరారు. ఇదే సమయంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీస్‌ జీపులో ఎక్కించుకొని ఆమెను అక్కడి నుంచి లోటస్‌పాండ్ తరలించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మూడు రోజుల పాటు దీక్షకు తలపెట్టిన షర్మిలను మొదటి రోజు సాయంత్రమే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరో రెండు రోజుల పాటు లోటస్‌పాండ్‌లోనే వైఎస్ షర్మిల దీక్షను కొనసాగించనున్నారు.

Next Story

Most Viewed