బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది అరెస్ట్

by  |
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన సిద్దార్థతో పాటు మరో 14మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. కాగా భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఈనెల 6న మంత్రి అఖిల ప్రియ అరెస్టైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed