చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరానికి సమస్య !

by  |
చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరానికి సమస్య !
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ సమస్య వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొదట రూ.55వేల కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇప్పుడు కేంద్రం చెబుతున్న అంచనాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. పోలవరం విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవన్న సజ్జల.. ప్రాజెక్ట్‌ను నిర్మించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రికి.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖలు రాసినట్లు ఆయన గుర్తు చేశారు. శనివారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed