- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మానకొండూర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న అలసత్వం వీడకుంటే తెలంగాణలో ఉద్యమం చేపడుతామని రైతు సంఘాల సమాఖ్య జాతీయ నేత పోలాడి రామారావు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు, ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై.. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో రైతు ప్రజా సంఘాల ఓసీ సమాఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా, వర్షాలకు తడిచి మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో దాని పరిమితిని తగ్గించారన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఓ వైపు కేంద్రం బాయిల్డ్ బియ్యం కొనమని మొండి వైఖరి అవలంభించడం, మరో వైపు వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు యాసంగి సాగుపై అయోమయంలో ఉన్నారని గుర్తుచేశారు. వెంటనే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.