‘భారత్‌లో విలీనానికి పీవోకే డిమాండ్ చేస్తది’

by  |
‘భారత్‌లో విలీనానికి పీవోకే డిమాండ్ చేస్తది’
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరాల్లో జమ్ము కశ్మీర్‌లో మోడీ ప్రభుత్వం భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందనీ, వాటిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ప్రజలూ భారత్‌లో అంతర్భాగంగా ఉంటామని డిమాండ్ చేస్తారని అన్నారు. ఈ డిమాండ్‌లతోనే పీఓకే భారత్ అంతర్భాగమని పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడానికి సులువవుతుందని తెలిపారు.

జమ్ము కశ్మీర్‌లో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ ప్రసంగంలో ఆర్టికల్ 370 గురించీ ప్రస్తావించారు. అలాగే, చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఇప్పుడు బలహీనదేశం కాదని అన్నారు. దేశ ప్రతిష్టతకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు.

దేశ భద్రతలో బలాన్ని మరింత పెంచుకున్నామని తెలిపారు. అయితే, ఈ బలం వేరే దేశాలను భయపెట్టేందుకు కాదనీ, కేవలం దేశ భద్రత కోసమేనని వివరించారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు తొలిగిపోయేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మిలిటరీ, దౌత్య స్థాయి చర్చల ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed