ఏపీ రాజధాని, సీఆర్డీఏ బిల్లుపై కేంద్రం ఆరా

by  |
ఏపీ రాజధాని, సీఆర్డీఏ బిల్లుపై కేంద్రం ఆరా
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు పంపిన మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులపై ప్రధాని కార్యాలయం( పీఎంవో) ఆరాతీసింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు గవర్నర్‌ను కోరింది. దీంతో గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాజకీయ విశ్లేషకులు, ఫ్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. దీంతో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది. కాగా, ఈ బిల్లుల ఆమోద ముద్రపై గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు.

Next Story

Most Viewed