‘ఎంపీలు.. శాంతి, ఐక్యతలకు దోహదపడాలి’

by  |
‘ఎంపీలు.. శాంతి, ఐక్యతలకు దోహదపడాలి’
X

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లు జరిగిన అనంతరం నిర్వహించిన బీజేపీ ఎంపీల సమావేశంలో శాంతి, సామరస్యం, ఐక్యతల గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. దేశాభివృద్ధికి శాంతి, సామరస్యత, ఐక్యతలు ముఖ్యమైనవని అన్నారు. పార్టీ నేతలందరూ ఈ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశమంతటా ఇవి పాదుకునేందుకు కృషి చేయాలని సూచించారు. దాదాపు 46 మందిని పొట్టనబెట్టుకున్న ఈశాన్య ఢిల్లీ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ పిలుపునివ్వడం గమనార్హం.

Tags: PM modi, peace, unity, harmony, bjp mp’s meet



Next Story

Most Viewed