గ్రేటర్ ఎన్నికల వేళ మోదీ రాక

by  |
గ్రేటర్ ఎన్నికల వేళ మోదీ రాక
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ దేశ ప్రధాని మోదీ హైదరాబాద్ రాక ఉత్కంఠగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా తయారుచేస్తున్న భారత్‌ బయోటెక్ వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలనకు వస్తున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 29న ప్రత్యేక విమానంలో మోదీ హాకీంపేటకు చేరుకోనున్నారు. అయితే, మోదీ ఆకస్మిక టూర్‌ తెలంగాణలో రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీ గ్రేటర్ టూర్, వ్యాక్సిన్ పరిశీలనకు రావడం గమనార్హం.


Next Story