కేరళ సీఎంకు ప్రధాని మోడీ ఫొన్..

by  |
కేరళ సీఎంకు ప్రధాని మోడీ ఫొన్..
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ విమానాశ్రయం రన్ వే పై జరిగిన ప్రమాదంలో ఏయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికి పైగా ప్యాసింజర్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా ఈ ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని మోడీ శుక్రవారం రాత్రి ఫొన్ ద్వారా సంభాషించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం విజయన్‌కు ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed