నివాళులర్పించి.. కలిసి పోరాడమంటున్న మోడీ

by  |
నివాళులర్పించి.. కలిసి పోరాడమంటున్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవబోదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్గిల్ దివాస్ ను ఆయన ప్రస్తావిస్తూ వీరజవాన్లకు నివాళులర్పించారు. దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరవలేమన్నారు. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. దేశ సమగ్రత కోసం సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం అని మోడీ అన్నారు. అనంతరం కరోనాపై మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు.

Next Story