- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు శనివారం ‘చక్కా జామ్’(రోడ్ల నిర్భంధం)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రేపు జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సరిహద్దులను బ్లాక్ చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, ముళ్ల కంచెలు, రోడ్లపై మేకులను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ భవన్లో ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీట్ నడుస్తోంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషి, ప్రకాశ్ జవడేకర్ హాజరయ్యారు. ఇదిలాఉండగా, సాగు చట్టాలపై సోమవారం రాజ్యసభలో ప్రధాని మోడీ విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వనున్నారు. కాగా, గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలపై రచ్చ నడుస్తోంది. అందువల్లే ప్రధాని హైలెవల్ కమిటీ మీట్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.