ఢిల్లీ ప్రజలారా.. శాంతి పాటించండి

by  |
ఢిల్లీ ప్రజలారా.. శాంతి పాటించండి
X

న్యూఢిల్లీ : ఢిల్లీ హింస చెలరేగి దాదాపు మూడు రోజులు గడిచాక నేడు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘శాంతి, సామరస్యం మన సంస్కృతిలో కీలకం. ఢిల్లీ సోదర, సోదరీమణులు శాంతి పునస్థాపనకు సోదరభావాన్ని పాటించండి. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తోడ్పడండి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. బుధవారం సాయంత్రానికి ఈ అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 24కు చేరింది.



Next Story