భారత్ రికార్డు క్రియేట్.. మోడీ, వైద్య సిబ్బందికి SpiceJet స్పెషల్ విషెస్

by  |
భారత్ రికార్డు క్రియేట్.. మోడీ, వైద్య సిబ్బందికి SpiceJet స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో భారత ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ SpiceJet.. ప్రధాని మోడీ, వైద్య సిబ్బందిని వినూత్న రీతిలో అభినందించింది. మైల్‌స్టోన్ అధిగమించిన సందర్భంగా స్పైస్ జెట్.. విమానంపై మోడీ, వైద్య సిబ్బంది ఫోటోలను ముద్రించి అభినందనలు తెలిపింది.


Next Story

Most Viewed