కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేసి.. చివరికి..!

by  |
కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేసి.. చివరికి..!
X

దిశ, జనగామ: ఏటీఎంల వద్దకు వచ్చిన అమాయకులను ఆసరాగా చేసుకుని సాయం చేస్తామని దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు చేధించారు. బుధవారం జనగామ కలెక్టర్ కార్యాలయం లో డీసీపీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఏటీఎం కార్డు దొంగల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొమ్మ రాజు, కరటకం సాయికిరణ్, ఇల్లు వెంకట సాయి కిరణ్, కొప్పి శెట్టి రాజ్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏటీఎం సెంటర్ల వద్ద నిరక్షరాస్యులను టార్గెట్ చేస్తూ, ఏటీఎం కార్డు ద్వారా వారికి సహాయం చేస్తామని ఏటీఎం కార్డులు తీసుకొని వారిని నమ్మించి కార్డు మార్పిడి చేపట్టి డబ్బులు రావడం లేదని కార్డు తీసుకునే వారు. ఇలా తీసుకున్న ఏటీఎం కార్డులతో వేరే ఏటీఎం సెంటర్ల లో డబ్బులు డ్రా చేసుకొని జల్సాలకు పాల్పడేవారు.

పోలీస్ కమిషనర్ కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జరుపుతున్న విచారణలో ఈ దొంగల ముఠా ను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలో, జనగామ పట్టణంలో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, సూర్యాపేట, వనపర్తి, రంగారెడ్డి, కర్నూలు టౌన్, కడప టౌన్, చిత్తూరు వంటి తదితర ప్రాంతాల్లో అనేకంగా కార్డు మార్పిడి ద్వారా ఏటీఎం లో డబ్బులు చేయడాన్ని వరంగల్ సీసీఎస్ పోలీసులు గుర్తించి నిందితులను జనగామలో పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుబడిన వారంతా 30 సంవత్సరాల లోపు వారని కరోనా సమయం లో కష్టపడకుండా సుఖంగా డబ్బులు సంపాదించేందుకు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. పట్టుబడిన వారిపై గతంలోనూ అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు.

నిందితుల్లో కొప్పిశెట్టి రాజు కుమార్ పరారీలో ఉన్నారని, పట్టుబడిన ముగ్గురిని రిమాండ్ చేయడం జరిగిందన్నారు. వీరి వద్ద ఒక లక్షా 60 వేల రూపాయల నగదు, 8 డూప్లికేట్ ఎటిఎం కార్డ్స్, ఒక మారుతి బెలోనో కార్, ఒక మారుతి ఇగ్నిస్ కార్, మూడు సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగిందని సీపీ తరుణ్ జోషి తెలియజేశారు. ఏటీఎం దొంగల ముఠాను చేధించిన పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, జనగామ పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు. సమావేశంలో వెస్ట్ జనగామ పోలీసు బృందం ఉన్నారు.



Next Story

Most Viewed