- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎలా సోకుతుందో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా మందిని కలిసేవారిలో ఈ వైరస్ పాజిటివ్ సోకినట్టు ఇప్పుడు తెలిసినా.. ఎంతమందికి ఆ మహమ్మారి పాకిందో అన్న ఆందోళనలు వెల్లడవుతున్నాయి. ఇటువంటి రీతిలోనే ఢిల్లీలో ఓ కేసు నమోదైంది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతను డెలివరీ చేసిన కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. ఆ బాయ్ డ్యూటీలో ఉన్నప్పుడు డెలివరీ చేసిన 72 కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్లోకి పంపారు. అంతేకాదు, కనీసం 20 మంది సహడెలివరీ ఏజెంట్లనూ నిర్బంధంలోకి తరలించారు. ఆ బాయ్కు కూడా అతను డెలివరీ చేసిన ఓ కుటుంబం నుంచి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సౌత్ ఢిల్లీలో 19 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్.. ఏప్రిల్ 12వ తేదీ వరకు డ్యూటీ చేశాడు. అతనికి కరోనా పాజిటివ్ తేలడంతో.. ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.
Tags: coronavirus, delhi, delivery boy, quarantine, agent, pizza