బెడిసిన గోవా టూర్.. అసహనంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

by Sridhar Babu |   ( Updated:2021-12-08 23:06:29.0  )
Pinapaka TRS public representatives
X

దిశ, మణుగూరు: ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొందరిని గోవా, మరి కొందరిని బెంగళూరుకు తరలించారు. ఈ క్రమంలో పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులను స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు జెండా ఊపి గోవా టూర్‌కు పంపిన సంగతి తెలిసిందే. అయితే, గోవా టూర్‌ ముగించుకొని తిరుగు ప్రయాణమైన ప్రజాప్రతినిధులకు ఎయిర్‌పోర్టులో ఊహించని పరిణామంతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.

ఎయిర్‌పోర్టులో టికెట్ తీసుకున్న వారిని, బోర్డింగ్ పాస్‌ లేదని అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఫ్లైట్ మిస్‌ అయ్యి అక్కడే ఆగిపోయారని మరికొందరి సమాచారం. దీంతో వారు ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. మరుసటి రోజు ఫ్లైట్ కోసం వేచిచూడక తప్పలేదు. దీంతో గోవా టూర్‌కి వెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసహనంతో ఉన్నట్లు సమాచారం. మరికొందరైతే అసలు టూర్‌కి ఎందుకొచ్చామా? అని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా తిరుగుప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కోరుతున్నట్లు వినిపిస్తోంది.



Next Story