- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: కరోనా ఆస్పత్రిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకటి, రెండు అనుకుంటే మన తప్పే.. దాదాపుగా 50 మేర పందులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటి పని అవి చేసుకుంటుండగా డాక్టర్లతో పాటు మిగిలిన సిబ్బంది కూడా పందులను చూసి చూడనట్లు వదిలేయడం గమనార్హం. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పందులు స్వైర విహారం చేస్తున్నా ఆస్పత్రి సిబ్బందికి రోగుల పట్ల గానీ, శుభ్రత పట్ల ఏ మాత్రం బాధ్యత లేనట్లు కనిపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా దేశంలో మరణ మృదంగం మోగిస్తుంటే.. పందుల వలన కొత్త రోగాలు రావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క సీన్తో కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఏ విధంగా స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉంటే కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 60వేలకు చేరుతోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా కరోనా బారినపడి మృతిచెందారు.