- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ ప్రీమియం స్కూటర్ కంపెనీ పియాజియో ఇండియా తన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ బుకింగ్లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ స్కూటర్ను పొందడానికి రూ. 5000 చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చని, బీఎస్-6 ప్రమాణాలతో దీన్ని తీసుకువస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అయినప్పటికీ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ఉత్పత్తిని కొనసాగించామని కంపెనీ పేర్కొంది.
దీన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకువస్తామని, ఆధునిక ఫీచర్లతో పాటు తర్వాతి తరాన్ని ఆకట్టుకునే డిజైన్ను కలిగిన ఈ ప్రీమియం స్కూటర్ కస్టమర్లకు సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని పియాజియో ఇండియా ఛైర్మన్ డీగో గ్రాఫీ చెప్పారు. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ మొబైల్ కనెక్టివిటీ, డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ స్ప్లిట్ హెడ్లైట్, అధునాతన బ్యాక్ సస్పెన్షన్స్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంటుందని కంపెనీ వివరించిది. ఈ ప్రీమియం స్కూటర్ను బుక్ చేసుకునేందుకు కంపెనీ వెబ్సైట్ ద్వారా గాని, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్ల వద్ద గాని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.