- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శేరిలింగంపల్లి : పురుగుల మందు తాగి పీహెచ్డీ స్కాలర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం కమాలుద్దీన్ పూర్కు చెందిన శివ కుమార్ (31)సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీలోని కె బ్లాక్ రూమ్ నెంబర్ 325లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
ఈ రోజు మధ్యాహ్నం సమయంలో పురుగుల మందు సేవించగా అతని స్నేహితులు గమనించి హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, శివకుమార్ ఆత్మహత్యయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు అతని గదిలో సూసైడ్ నోట్ లభించినట్టు పోలీసులు తెలిపారు. ఈ పెళ్లి చేసుకునేకంటే చావడమే నయమని అందులో రాసి ఉన్నట్లు తెలుస్తోంది. శివకుమార్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.