లాక్‌డౌన్ పొడగింపులో పెట్రోల్ బంకులు ఓపెన్

by  |
లాక్‌డౌన్ పొడగింపులో పెట్రోల్ బంకులు ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఈనెల 22వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈనెల 30 వరకు పొడగించారు. అయితే, పెట్రోల్ బంకులకు మాత్రం రిలాక్సేషన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలు, అమ్మకాలు సాగుతున్నాయి.

ఉదయం 10 గంటలకే పెట్రోల్ బంకులు మూసివేయడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడంతో ఈ మేరకు ప్రభుత్వం పెట్రోల్ బంకులను లాక్‌డౌన్ నుంచి మినహాయించినట్లు సమాచారం. ఇదిలాఉండగా, జాతీయ రహదారులపై ఇప్పటికే పెట్రోల్ బంకుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed