3 రాజధానులపై హైకోర్టులో పిటిషన్

by  |
3 రాజధానులపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతు పరిరక్షణ సమితి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ మూడు రాజధానుల గెజిట్ ను నిలిపివేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్దణని ప్రకటించాలని, రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నది. కాగా, ఈ పిటిషన్ పై ధర్మాసనం రేపు విచారణ జరపనున్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed