- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పబ్బ గణేష్ అనే యువకుడు శనివారం గ్రామంలోని పెద్దబండ పరిసర ప్రాంతంలోని వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, మృతుడు గణేష్ ఇటీవల ఓ కేసులో ఇరుక్కోగా.. దానికి భయపడి ఉరి వేసుకున్నట్టుగా గ్రామస్తులు గుసగుస లాడుకుంటున్నారు. కాగా గణేష్ బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో గ్రామంలోని ఓ ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, గన్నేరువరం ఎస్ఐ మామిడాల సురేందర్, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్ మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి, పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.