అనారోగ్యం పాలైన తల్లి.. ఉరేసుకున్న కొడుకు

by  |
అనారోగ్యం పాలైన తల్లి.. ఉరేసుకున్న కొడుకు
X

దిశ, కోదాడ : ఓ యువకుడిని కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఉరేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్తూరి నరేంద్ర (26) కష్టాల కడలిలో కూరుకుపోయాడు.

గత కొన్ని నెలల కిందట తండ్రి మృతి చెందగా.. తల్లి అనారోగ్యం పాలైంది. దీనికి తోడు అతన్ని ఆర్థిక ఇబ్బందులు వేధించడంతో ఒత్తిడి తాళలేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు.మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సైదా తెలియజేశారు.

Next Story

Most Viewed