అప్పు తీర్చాలని ఒత్తిడి పెంచడంతో వ్యక్తి ఆత్మహత్య

by  |
అప్పు తీర్చాలని ఒత్తిడి పెంచడంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, చండూర్ : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని ధోని పాముల గ్రామానికి చెందిన నాగార్జున జంగాచారి తండ్రి నారయ్య (57) వడ్రంగి పని చేసుకునే వారు. ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

గమనించిన స్థానికులు వెంటనే అతన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. అతని మరణానికి అప్పులే కారణంగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు చండూర్ ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed