బెడిసికొట్టిన యూట్యూబ్ ప్రయోగం.. మానేర్ వాగులో పడి వ్యక్తి మృతి

by  |
బెడిసికొట్టిన యూట్యూబ్ ప్రయోగం.. మానేర్ వాగులో పడి వ్యక్తి మృతి
X

దిశ , సుల్తానాబాద్ : సరదాగా యూట్యూబ్‌లో చేపలు పట్టే వీడియోలు చూసి ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. అలా ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా..? నిజమే ఇక్కడ జరిగింది తెలిస్తే నమ్మక తప్పదు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన ఈర్ల శంకర్ అనే యువకుడు మరో ఇద్దరు మిత్రులతో కలిసి మానేరు వాగులో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడం ఎలాగో తెలియకపోయినా యూట్యూబ్‌లో చూసి కరెంటు షాక్ పెట్టి చేపలు పడుదామని అనుకున్నారు. తీరా ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది.

చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో ఆ వ్యక్తి వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తోటి వ్యక్తుల ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. ఈర్ల శంకర్ మృతిలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుల్తానాబాద్ ఎస్సై ఉపేందర్ రావు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story