జోరువాన..పిడుగు పాటుకు ఒకరు మృతి

by  |
జోరువాన..పిడుగు పాటుకు ఒకరు మృతి
X

దిశ, కరీంనగర్ :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వర్షానికి తోడు వచ్చిన పిడుగుపాటుకు కూలీ గుడుగుల రాములు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలోని పలు చోట్ల కూడా వర్షం పడటంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది.



Next Story