రెండు బైక్‌లు ఢీ..ఒక‌రు మృతి

by  |
రెండు బైక్‌లు ఢీ..ఒక‌రు మృతి
X

దిశ‌, ఖ‌మ్మం: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురానికి కోటయ్య(40) పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటయ్య కింద పడిపోగా తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.గాయాల పాలైన మరో వ్యక్తిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న తపోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Next Story