బావుపేటలో లారీ, బైక్ ఢీ..

by  |
బావుపేటలో లారీ, బైక్ ఢీ..
X

దిశ, కరీంనగర్:
వేములవాడకు వెళ్లే దారిలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టగా ఒకరు మృతిచెందారు.ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బావుపేట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..రాంనగర్‌లో నివాసముంటున్న ఎలగందల రాజు బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.



Next Story

Most Viewed