ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

by  |
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, పటాన్‌చెరు: కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామానికి చెందిన కొనలోళ్ల కాశీనాథ్(43) వృత్తిరీత్యా డ్రైవర్. గత ఎనిమిది నెలలుగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకుబావిలో అద్దెకు నివాసం ఉంటున్నాడు. కాశీనాథ్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యతో వివాదాలకు తోడు మద్యానికి, ఇతర చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఒంటరిగా ఉంటున్న కాశీనాథ్ ఈ క్రమంలోనే ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి గదిలో నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. భార్య సంగీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed