ఇంటి అద్దె అడిగినందుకు కొడవలితో దాడి

by  |
ఇంటి అద్దె అడిగినందుకు కొడవలితో దాడి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఇంటి అద్దె విషయంలో గొడవ జరగడంతో యజమానిపై కొడవలితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడ వీఎన్‌రెడ్డి కాలనీలోని డిమార్ట్ సమీపంలో వజ్రమ్మ అనే మహిళ ఇంట్లో దాలా నిశ్చల్ అలియాస్ కార్తీక్, చంద్రకళ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కార్తీక్ అద్దె చెల్లించకపోవడంతో యజమాని వజ్రమ్మ గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే అద్దెకు ఉంటున్న వ్యక్తి యజమానినే బెదిరించడంతో ఆమె తన కొడుకుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న సాయిలు గౌడ్‌, కార్తీక్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో కార్తీక్… సాయిలు గౌడ్‌పై కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుడు సాయిలు గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Next Story

Most Viewed