ఆ ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు వర్తిస్తాయి: ఎన్‌జీటీ

by  |
ఆ ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు వర్తిస్తాయి: ఎన్‌జీటీ
X

దిశ, వెబ్ డెస్క్: బాణ సంచా కాల్చి పర్యావరణానికి ముప్పు కలిగించే వారిపై నిఘా ఉంచాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి పరిహారం వసూలు చేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది. దేశ వ్యాప్తంగా బాణసంచా కాల్చడం, అమ్మకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో నిషేదం కొనసాగుతుందని ఎన్‌జీటీ స్పష్టంచేసింది.

కరోనా ప్రభావం దృష్ట్యా దేశ వ్యాప్తంగా నిషేదం కొనసాగుతుందని తెలిపింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ పర్యావరణ హిత బాణా సంచా కాల్చేందుకు సమయం కేటాయించింది. గాలి నాణ్యత సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని చెప్పింది. రాత్రి 11.55 నుంచి 12.30 వరకు బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇచ్చింది.


Next Story