ఏపీ అంబులెన్సులకు అనుమతి

by  |
ఏపీ అంబులెన్సులకు అనుమతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణలోకి వస్తున్న అంబులెన్స్ లకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన అంబులెన్సులను రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద అడ్డుకున్న నేపథ్యంలో.. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకొని అంబులెన్స్ లను అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రానికి గద్వాల జోగులాంబ జిల్లా పోలీస్ అధికారులకు అందాయి. ఈ మేరకు అలంపూర్ సమీపంలో ఉన్న పుల్లూరు టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా వద్ద ఉన్న చెక్ పోస్ట్ ద్వారా అంబులెన్సులను అడ్డుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు.

ముందుగా నిర్ణయించినట్లు ఆసుపత్రుల అనుమతులు, తెలంగాణ రాష్ట్రం నుండి పొందిన ఈ పాస్ లు లేకున్నప్పటికీ అంబులెన్సులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీనితో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అంబులెన్సులు సమస్య తొలగినట్లు అయింది.


Next Story

Most Viewed